కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఓటేస్తే కష్టాల పాలవుతాం : పద్మా దేవేందర్​రెడ్డి

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఓటేస్తే కష్టాల పాలవుతాం : పద్మా దేవేందర్​రెడ్డి

మెదక్ టౌన్, వెలుగు: కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఓటేస్తే కష్టాల పాలవుతామని బీఆర్ఎస్​ మెదక్​ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని  రాయిన్​పల్లి, శివ్వాయిపల్లి, మల్కాపూర్​, కోంటూరు గ్రామాల్లో ఎన్నికల  ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏ పథకాన్ని ప్రవేశపెట్టాలన్నా  ఢిల్లీలో ఉన్న హైకమాండ్​ నిర్ణయించాలి.. అదే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అందరి నిర్ణయం మేరకే సీఎం కేసీఆర్  సంక్షేమ పథకాలను  ప్రవేశపెడతారన్నారు.

మైనంపల్లి హన్మంతరావు గొడవలు చేయడం మల్కాజిగిరిలో నడుస్తది కానీ.. మెదక్ నియోజకవర్గంలో కుదరదన్నారు.  రూరల్ ఏరియాలో ఏ గ్రామాలు ఎక్కడ ఉన్నాయో కూడా మైనంపల్లి రోహిత్​కు తెలియదని ఎద్దేవా చేశారు. మెదక్ అభివృద్ధి పరంపర కొనసాగాలంటే అందరూ తనను ఆశీర్వాదించాలని కోరారు. కార్యక్రమంలో మెదక్​ జడ్పీ వైస్​ చైర్​పర్సన్​ లావణ్య, మెదక్​ ఎంపీపీ జమున, పాల్గొన్నారు. 

నిజాంపేట: తండాలను పంచాయతీలు చేసిన ఘనత  సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దేనని మెదక్ నియోజకవర్గ గిరిజన ఇన్​చార్జ్​  బీలు నాయక్ అన్నారు. మండల పరిధి బచ్చురాజ్ పల్లి తండాలో  బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో రామచందర్, కనక నాయక్, నర్సింలు నాయక్, సత్యం నాయక్  పాల్గొన్నారు.