ప్రచార వ్యూహాలపై నేడు బీఆర్ఎస్ భేటీ

ప్రచార వ్యూహాలపై నేడు బీఆర్ఎస్ భేటీ

హైదరాబాద్, వెలుగు : ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన జాగ్రత్తలు.. పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశాలపై బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ సమావేశాలు నిర్వహించనున్నది. ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎన్నికల ఇన్ చార్జీలు, వార్ రూమ్ ఇన్ చార్జీలతో పాటు ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలు , కార్యకర్తలు సమావేశాల్లో పాల్గొనాలని ఆహ్వానం పంపారు. 

మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సోషల్ మీడియాను ఎలా వినియోగించుకోవాలనే అంశంపై ఇటీవల నిర్వహించిన సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు చేసిన సూచనలను ఇన్ చార్జీలు వివరిస్తారు. అలాగే నియోజకవర్గ స్థాయిలో వార్ రూమ్ లను బలోపేతం చేయడం, ప్రతి పోలింగ్ బూత్ లోని వంద మంది ఓటర్లకు ఒక ఇన్ చార్జీ నియామకం సహా ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. సమావేశాల వివరాలను ఎలక్షన్ ఇన్ చార్జీలు స్టేట్ వార్ రూమ్ కు పంపనున్నారు.