- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపేమీ రేవంత్ పాలనకు ప్రజల ఆమోదం కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. ఘన విజయం సాధించినట్టు రేవంత్ భావిస్తున్నారని, ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సర్వసాధారణమని తెలిపారు.
ఎన్నో ఉప ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్పార్టీ గతంలో డిపాజిట్లు కోల్పోయిందని గుర్తుచేశారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. సీఎం,15 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్యకర్త నుంచి డీజీపీ వరకు ఎన్నికల కోసం పని చేశారన్నారు. అసదుద్దీన్తో బోగస్ ఓట్లు వేయించారని ఆరోపించారు.
