బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో చేర్పించండి .. సీఎంకు దాసోజు శ్రవణ్ లెటర్

బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో చేర్పించండి .. సీఎంకు దాసోజు శ్రవణ్ లెటర్

హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు: బీసీ 42% రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో చేర్పించేలా పార్లమెంట్​లో ఆందోళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ దాసోజు శ్రవ ణ్ డిమాండ్ ​చేశారు. బుధవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకత లేకుండా కులగణన చేసిందని, రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా రిపోర్టును సీక్రెట్​గా పెట్టిందని విమర్శించారు. 

 కులగణన పేరుతో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, ఆయన కేబినెట్‌‌‌‌‌‌‌‌ బీసీలను మోసం చేస్తున్నారని శ్రవణ్‌‌‌‌‌‌‌‌ ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించి రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లను పబ్లిక్‌‌‌‌‌‌‌‌ డొమైన్స్‌‌‌‌‌‌‌‌లో పెట్టాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు.