హైదరాబాద్​ చేరిన భద్రాచలం బీఆర్​ఎస్​ పంచాయితీ

హైదరాబాద్​ చేరిన భద్రాచలం బీఆర్​ఎస్​ పంచాయితీ

భద్రాచలం, వెలుగు : భద్రాచలం నియోజకవర్గంలో  బీఆర్​ఎస్​    పంచాయితీ హైదరాబాద్​కు చేరింది.   ఐదు మండలాలకు చెందిన లీడర్లు సోమవారం  మంత్రి హరీశ్​రావుతో, మంగళవారం కేటీఆర్​తో   మాట్లాడనున్నారు.  దీనితో వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండల కమిటీలు హైదరాబాదుకు బయలుదేరాయి.  భద్రాచలం నియోజకవర్గం అభ్యర్థిగా తెల్లం వెంకట్రావ్​ ను ప్రకటించడం,  ఎన్నికల ఇన్​చార్జిగా గా ఉన్న మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణను పక్కన బెట్టడాన్ని  కమిటీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 

ఇప్పటికే వాజేడు, వెంకటాపురం, చర్ల, భద్రాచలంలలో కమిటీల అధ్యక్ష,కార్యదర్శులు    మీటింగ్​  పెట్టుకున్నారు.  స్వార్థం కోసం పార్టీని వదిలి కాంగ్రెస్​కు వెళ్లి, అక్కడ టిక్కెట్ రావట్లేదని తిరిగి పార్టీలోకి వచ్చిన వెంకట్రావ్​కు టిక్కెట్ ఇవ్వడాన్ని స్థానిక లీడర్లు ఖండిస్తున్నారు.    ఈ నేపథ్యంలో స్థానిక లీడర్లకు హైకమాండ్​ పిలుపు రావడంతో..  ఏం జరుగుతుందోనన్న ఆసక్తి మొదలైంది.