బీఆర్ఎస్​ సర్పంచ్​ దౌర్జన్యం.. వివాదం పరిష్కరించాలని అడిగినందుకు వ్యక్తిపై దాడి

బీఆర్ఎస్​ సర్పంచ్​ దౌర్జన్యం.. వివాదం పరిష్కరించాలని అడిగినందుకు వ్యక్తిపై దాడి

తెలంగాణ జిల్లాల్లో పలువురు అధికార పార్టీ సర్పంచ్​లు, నేతల దౌర్జన్యాలు ఎక్కువవుతున్నాయి. తాజాగా వరంగల్​ జిల్లాలో  ఓ సర్పంచి నిరుపేదలపై దాడికి పాల్పడ్డారు. 

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గీసుగొండ మండలం ఎల్కుర్తి గ్రామానికి చెందిన సురేష్ ఓ వివాదం పరిష్కరించాలని బీఆర్​ఎస్​ సర్పంచ్ జైపాల్​రెడ్డిని ఆశ్రయించారు.  ఈ క్రమంలో సర్పంచ్​సురేష్​పై దాడికి పాల్పడ్డాడు.  

గ్రామస్థుల ముందు సర్పంచ్​ దాడి చేయడంతో మనస్తాపానికి గురైన సురేష్​ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారని కుటుంబసభ్యులు వాపోయారు. అతని పరిస్థితి విషమించడంతో వరంగల్​ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నాడు. 

సర్పంచ్​పై చర్యలు తీసుకోవాలని సురేష్ కుటుంబసభ్యులు డిమాండ్​ చేస్తున్నారు.