వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలి

వచ్చే ఎన్నికల్లో  బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలి

అమ్రాబాద్, వెలుగు: ప్రజలను ఎమ్మెల్యే గువ్వల, మంత్రి హరీశ్​రావు మోసం చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు నల్లమల ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు కోరారు. మంగళవారం అమ్రాబాద్, అచ్చంపేటలో  మంత్రి హరీశ్​ రావు పర్యటన నేపథ్యంలో బీజేపీ నేతలను తెల్లవారు జామున  అరెస్ట్ చేశారు. 

 ఈ సందర్భంగా స్టేషన్ లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని లేకుంటే బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  పార్టీ అమ్రాబాద్ మండల అధ్యక్షుడు రాజు, శ్రీనివాస్, వికాస్ గౌడ్, రాజు  గౌడ్, కార్తీక్, సతీష్, మురళీకృష్ణ, తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు.