కాంగ్రెస్ స్పీకర్ నామినేషన్ పత్రంపై కేటీఆర్ సంతకం

కాంగ్రెస్ స్పీకర్ నామినేషన్ పత్రంపై కేటీఆర్ సంతకం

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్  నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం  భట్టి విక్రమార్కతో  పాటు,  మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహా ,పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే  మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కూనంనేని సాంబశివరావు కూడా హాజరయ్యారు .ప్రసాద్ కుమార్ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై కేటీఆర్ సంతకం చేశారు. 

 స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ ఇప్పటికే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు తెలిపారు. ఇక ఎంఐఎం నుంచి మాజిద్ ఉస్సేన్ మద్దతు తెలిపారు.  డిసెంబర్ 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం స్పీకర్ ను ఎన్నుకోనున్నారు. 

సాధారణంగా  అధికార పార్టీకి చెందిన అభ్యర్థిని స్పీకర్ గా  ఎన్నుకుంటారు. గడ్డం ప్రసాద్ స్పీకర్ గా ఎన్నికైతే తెలంగాణ తొలి దళిత స్పీకర్  కానున్నారు.