హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ఎల్పీ నేతగా ఆ పార్టీ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ను ఎన్నుకోనున్నారు. ఇందుకోసం శనివారం ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్లో ఎమ్మెల్యేలు తమ పార్టీ శాసనసభాపక్షనేతగా కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ పక్షనేతగా కేటీఆర్, హరీశ్రావులలో ఒకరికి అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. కుటుంబ సభ్యులను కాదనుకుంటే మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి అవకాశం ఇవ్వొచ్చని ప్రచారం జరిగింది. శాసనసభ పక్షనేతగా తానే ఉంటానని కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలిసింది.
ఆయన ఆదేశాలతోనే శనివారం ఉదయం బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. కాలి తుంటి ఎముక విరిగి యశోదా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కేసీఆర్ హిప్ రీ ప్లేస్మెంట్సర్జరీ కోసం ఆపరేషన్ థియేటర్కు వెళ్లడానికి ముందు కేటీఆర్, హరీశ్రావుకు ఎల్పీ సమావేశం నిర్వహించాలని సూచించినట్టు తెలిసింది. బీఆర్ఎస్ఎల్పీ పక్షనేతగా కేసీఆర్ ఎన్నికైనా ఆయన ఇప్పట్లో అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదు. శనివారం రాత్రి ఆయనకు హిప్రీ ప్లేస్మెంట్సర్జరీ చేశారు. కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పట్టొచ్చని డాక్టర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో బడ్జెట్సెషన్లోనే ఆయన అసెంబ్లీకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్లుగా కేటీఆర్, హరీశ్రావుకు అవకాశం ఇవ్వొచ్చని సమాచారం.