
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పదేండ్ల అభివృద్ధి, రెండేండ్ల అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నికే జూబ్లీహిల్స్బై ఎలక్షన్ అని బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్ అన్నారు. బుధవారం పార్టీ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్వేసేందుకు బయల్దేరడానికి ముందు తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో సునీతకు కేసీఆర్టికెట్ఇచ్చారు. సునీత గెలుపుతో కాంగ్రెస్ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలై పేదలకు న్యాయం జరుగుతుంది. బీఆర్ఎస్గెలుపుతో కాంగ్రెస్కు కనువిప్పు కలగాలి” అని కేటీఆర్ అన్నారు.
రాష్ట్ర బంద్కు మద్దతు..
తెలంగాణ ఉద్యమం లాగానే బీసీ రిజర్వేషన్లపైనా ఉద్యమిద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు. 18న తలపెట్టిన రాష్ట్రబంద్కు మద్దతివ్వాలని బీసీ జేఏసీ నేతలు ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్గౌడ్తదితరులు బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసి కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్మాట్లాడుతూ.. బీసీ సంఘాల బంద్కు మద్దతిస్తామని ప్రకటించారు.