క్రికెట్ గ్రౌండ్లో  వ్యక్తి దారుణ హత్య

క్రికెట్ గ్రౌండ్లో  వ్యక్తి దారుణ హత్య

చేవెళ్ల, వెలుగు: మొయినాబాద్​ మున్సిపల్​పరిధిలోని కాశీం బౌలిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన బోనగిరి ఈశ్వర్ (34) బతుకుదెరువు కోసం మొయినాబాద్ పరిధిలోని సురంగల్‌‌ వచ్చి ఓ అద్దె ఇంట్లో భార్య , ఇద్దరు పిల్లలతో  కలిసి నివాసం ఉంటున్నాడు.

ఎన్కెపల్లి గ్రామానికి చెందిన ముదిగొండ సురేశ్ వద్ద హౌస్​ కీపింగ్​ సూపర్​వైజర్​గా పనిచేస్తున్నాడు.  మంగళవారం ఉదయం కాశీంబౌలిలోని రెయిన్​బో క్రికెట్ గ్రౌండ్​లో గుర్తుతెలియని వ్యక్తులు అతడిని హత్య చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐ పవన్ కుమార్ రెడ్డి తెలిపారు.