కరీంనగర్ కలెక్టరేట్ ముందు బీఎస్పీ ధర్నా

కరీంనగర్ కలెక్టరేట్ ముందు బీఎస్పీ ధర్నా

కరీంనగర్ కలెక్టరేట్ ముందు బీఎస్పీ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ గురుకుల పాఠశాల్లో సమస్యలను పరిష్కరించాలంటూ ధర్నా చేశారు. కలెక్టరేట్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. గురుకులాల్లో విద్యార్థులు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఆందోళన చేస్తున్న పార్టీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.