బహుజనులకు..రాజ్యాధికారం తేకపోతే రాళ్లతో కొట్టండి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బహుజనులకు..రాజ్యాధికారం తేకపోతే రాళ్లతో కొట్టండి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
  • ఓటమి భయంతోనే కేసీఆర్ ​రెండు చోట్ల పోటీ  
  • బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

నారాయణ్ ఖేడ్, వెలుగు : తెలంగాణ సీఎం కేసీఆర్​ఓటమి ఖాయమని తెలిసిందని, అందుకే రెండు చోట్లా పోటీ చేస్తున్నారని బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్​అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లోని రహమాన్ ఫంక్షన్ హాల్​లో ఏర్పాటు చేసిన శక్తిప్రదర్శన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తమపార్టీకి ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల షెడ్యుల్ తర్వాత దామాషా పద్ధతి ప్రకారం అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెడతామన్నారు.

నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మూడు ఫ్యామిలీల పాలనే కొనసాగుతోందన్నారు. తాను బహుజనులకు రాజ్యాధికారం తీసుకురాకుంటే ఖేడ్ ప్రజలు తనను రాళ్లతో కొట్టాలన్నారు. పార్టీ రాష్ట్రనాయకులు మేకల శంకర్, జిల్లా అధ్యక్షుడు నటరాజ్, నియోజకవర్గ నాయకులు భీమన్న, సంజీ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.