- బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య వెల్లడి
హైదరాబద్ సిటీ, వెలుగు : కర్నాటకలోని గుల్బర్గా బుద్ధ విహార్ నుంచి మొదలైన బుద్ధదమ్మ యాత్ర మార్చి 1కి తెలంగాణలోని నాగార్జునసాగర్ బుద్ధవనానికి చేరుకుంటుందని గగన్మాలిక్ ఫౌండేషన్ చైర్మన్ గగన్, బుద్ధవనం స్పెషల్ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. మార్చి 1 నుంచి 3 వరకు బుద్ధవనంలో వివిధ కార్యక్రమాలుం టాయని చెప్పారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వారు మీడియాతో మాట్లాడారు.
విశ్వశాంతి, సామరస్యం కోసమే ఈ యాత్రను చేపట్టామని పేర్కొన్నారు.గుల్బర్గాలోని బుద్ధ విహార్ నుంచి 3వ దమ్మ యాత్ర ప్రారంభమైందని, హైదరాబాద్లో మినిస్టర్లు మల్లు భట్టి విక్రమార్క, వివేక్ వెంకటస్వామి స్వాగతం పలికారన్నారు.
