నామినేటెడ్​ పదవులపై ఆశలు!    

నామినేటెడ్​ పదవులపై ఆశలు!    
  •     మంత్రి పదవిపై రాజగోపాల్​రెడ్డి ఆశలు 
  •     ఎమ్మెల్యే టికెట్ ఆశించినవారికి.. 
  •     కమ్యూనిస్టులకూ నామినేటెడ్​పోస్టుల్లో ప్రయార్టీ  
  •     బీసీ, ఎస్సీ, ఎస్టీలకే ప్రాధాన్యత 

నల్గొండ, వెలుగు : నామినేటెడ్​పదవులపై జిల్లా నేతలు పెట్టుకున్నారు. పార్లమెంట్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలు ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. దీంతో ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డ ముఖ్యనేతలు, ఎమ్మెల్యే టికెట్​ఆశించినవారికి నామినేటెడ్​ పోస్టుల్లో ప్రయార్టీ లభించనుంది. త్వరలో పీసీసీ పదవితోపాటు కేబినెట్ లో మార్పులు ఉంటాయని సీఎం రేవంత్​సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి మంత్రి పదవిపైనా అటు నామినేటెడ్​ పదవులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

భువనగిరి పార్లమెంట్​స్థానానికి ఇన్​చార్జిగా వ్యవహరించిన రాజగోపాల్​రెడ్డికి ఈదఫా కేబినెట్​లో బెర్త్​పై ఆశలు పెట్టుకున్నారు. చామల కిరణ్​ కుమార్​రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించిన రాజగోపాల్​రెడ్డికి అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అదే విధంగా పార్టీలో ఇన్నాళ్లు కష్టపడ్ట లీడర్లు, కమ్యూనిస్టులకూ నామినేటెడ్​పోస్టుల్లో అవకాశం కల్పిస్తారని అంటున్నారు. నామినేటెడ్​పోస్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకే ప్రాధాన్యత ఉంటుందని ఆ పార్టీ సీనియర్లు ఆశావహులకు సంకేతాలు ఇస్తున్నారు.

ఇప్పటికే సూర్యాపేట జిల్లాకు నా మినెటెడ్​ పోస్టుల్లో మొదటి ప్రయార్టీ ఇచ్చారు. పేటకు చెందిన పటేల్​రమేశ్ రెడ్డిని టూరిజం కార్పొరేషన్​చైర్మన్​గా భర్తీ చేశారు. కాబట్టి నెక్ట్స్​లిస్ట్​లో నల్గొండ, యాదాద్రి జిల్లాలకే ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది.   

మంత్రి కోమటిరెడ్డి, జానారెడ్డి కోటాలో ఎవరికి..

జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సన్నిహితుడు నల్గొండ పట్టణ కాంగ్రెస్​ అధ్యక్షుడు గుమ్మల మోహన్​ రెడ్డికి రాష్ట్ర స్థాయి పదవి ఇస్తామని పార్లమెంట్​ఎన్నికల టైంలో హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ మైనార్టీలు కాంగ్రెస్​ వైపే మొగ్గుచూపారు. కాబట్టి ఆ వర్గానికి రాష్ట్ర స్థాయిలో లేదంటే జిల్లాలో కీలక పదవి ఇస్తారనే టాక్​వినిపిస్తోంది. ఇక జానారెడ్డి కోటాలో నకిరేకల్ ఎమ్మెల్యే టికెట్​ఆశించిన కొండేటి మల్లయ్య ముందు వరుసలో ఉన్నారు. గత రెండు టర్మ్​ల నుంచి మల్లయ్య నకిరేకల్​టికెట్​ఆశించి భంగపడ్డారు.

నకిరేకల్​నుంచి గతంలో వేముల వీరేశం సన్నిహితుడు పూజర్ల శంభయ్య గతంలో బీసీ కార్పొరేషన్​చైర్మన్​గా పనిచేశారు. వీరేశంతోపాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్​లో చేరిన శంభయ్య నామినేటెడ్​ రేసులో ఉన్నారు. గౌడ, పద్మశాలి, ముదిరాజ్​సామాజికవర్గాలు బలంగా ఉన్న జిల్లాల్లో ఎలాంటి పదవి దక్కలేదు. కావున నామినేటెడ్​పోస్టుల్లో ఈ వర్గానికి కూడా సముచిత స్థానం కల్పిస్తారని చెబుతున్నారు.  

ఉమ్మడి జిల్లాల్లో మరిన్ని నామినేటెడ్​ పోస్టులు..

నాగార్జునసాగర్​ఎడమ కాల్వ చైర్మన్​గా గతంలో కోదాడకు చెందిన లక్ష్మీనారాయణరెడ్డి పనిచేశారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖలో డైరెక్టర్ గా హుజూర్​నగర్​కు చెందిన శివారెడ్డికి గతంలో చోటు దక్కింది. ఉమ్మడి జిల్లాలో డీసీసీబీ చైర్మన్, వైస్​చైర్మన్​పదవులు కోదాడ లీడర్లకే దక్కాయి. ఈ రెండు నియోజవర్గాల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీ సాధించినందున నామినేటెడ్​పోస్టులు ఆశిస్తున్నారు. ఎస్టీ కోటాలో నల్గొండ జిల్లా అధ్యక్షుడు శంకర్​నాయక్ ను కార్పొరేషన్ చైర్మన్​గా నియమిస్తారా.. లేదంటే నల్గొండ జడ్పీ చైర్మ న్​గా అవకాశం కల్పిస్తారన్నది వేచిచూడాల్సిందే. 

డీసీసీబీ, మదర్​డెయిరీ చైర్మన్​లకు ఎసరు..! 

త్వరలో నల్గొండ డీసీసీబీ చైర్మన్​ మహేందర్​రెడ్డిపై అవిశ్వాస తీర్మా నం పెట్టేందుకు రాజగోపాల్ రెడ్డి వర్గం పావులు కదుపుతోంది. మునుగోడు పీఏసీఎస్​ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్​ కుంభం శ్రీనివాస్​రెడ్డి చైర్మన్​అ య్యేందుకు డైరెక్టర్లతో మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో టెస్కాబ్​వైస్ చైర్మన్ పదవికి మహేందర్​రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మహేందర్ రెడ్డి శిష్యుడు, ప్రస్తుతం మదర్​డెయిరీ చైర్మన్​గా ఉన్న శ్రీకర్ రెడ్డిని సైతం పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్ రెడ్డి సోదరుడు మాజీ మదర్​డెయిరీ చైర్మన్​గుత్తా జితేందర్​రెడ్డి డెయిరీ చైర్మన్​ పదవి ఆశిస్తున్నారు.