
తమిళ దర్శకుడు శామ్ ఆంటోన్ రూపొందించిన తెలుగు చిత్రం ‘బడ్డీ’. అల్లు శిరీష్ హీరోగా కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా డైరెక్టర్ శామ్ ఆంటోన్ మాట్లాడుతూ ‘సినిమా బాగుందని పిల్లలు, పెద్దలు చెబుతుండటం సంతోషంగా ఉంది. మార్నింగ్ షోస్ నుంచే సినిమా హిట్ అనే మౌత్ టాక్ మొదలైంది. ఇందులోని కామెడీ, ఎమోషన్, యాక్షన్తో పాటు టెడ్డీ బేర్ క్యారెక్టర్ ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేస్తోంది.
మా ప్రొడ్యూసర్తో రెండేళ్ల క్రితం తమిళ మూవీ ‘టెడ్డీ’ని రీమేక్ చేయాలని ప్రస్తావన వచ్చినప్పుడు.. అందులోని లైన్ను మాత్రమే తీసుకుని కంప్లీట్ కొత్త కథతో దీన్ని ప్లాన్ చేశాం. ఇందుకోసం రాజమౌళి గారి ‘ఈగ’ రిఫరెన్స్ తీసుకున్నా. ఆ చిత్రంలోని ఎమోషన్ మనకూ వర్కవుట్ అవుతుందని చెప్పా. యాక్షన్, అడ్వెంచర్ ఈ కథలో ఉన్నప్పటికీ.. లవ్ స్టోరీ మెయిన్గా ఉంటుంది. ఏటీసీలో వర్క్ చేసే అమ్మాయి, పైలట్కు మధ్య జరిగే ప్రేమ కథ అందర్నీ ఆకట్టుకుంటుంది’ అని చెప్పాడు.