వరల్డ్ బ్యాంకు నిధులపై బుగ్గన క్లారిటీ

వరల్డ్ బ్యాంకు నిధులపై బుగ్గన క్లారిటీ

ప్రపంచ బ్యాంకు నిధులపై ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ క్లారిటీ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు నిధులపై అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. ప్రపంచ బ్యాంకు ఏపీకి 5 వేల కోట్లు ఆర్థిక సాయం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. గతంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతిలో పర్యటించినప్పుడు అక్కడి రైతులు,ఎన్జీవోలు అమరావతి అవినీతిపై ఫిర్యాదు చేశారని చెప్పారు. అందుకే ఏపీకి ఇస్తానన్న రూ.3500 కోట్ల సాయం నిలిపివేశారని అన్నారు.తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నవరత్నాలకు ప్రపంచ బ్యాంకు సాయం చేసేందకు సిద్ధంగా ఉందన్నారు బుగ్గన