ఉప్పల్, వెలుగు: నిర్మాణంలో ఉన్న ఓ భవనంపై నుంచి పడి కూలీ మృతిచెందాడు. ఉప్పల్ భగాయత్లోని ప్లాట్ నంబర్ 744లో నిర్మాణంలో ఉన్న భవనంలో సెంట్రింగ్ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర గోండియా ప్రాంతానికి చెందిన ద్వారకా ప్రసాద్(41) అనే కూలీ ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి కిందపడ్డాడు. తీవ్ర గాయాలై స్పాట్లో చనిపోయాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో భవన యాజమాని హర్షసాయి, మేస్ర్తీ తిరుపతిపై కేసు నమోదు చేసినట్లు ఉప్పల్ పోలీసులు తెలిపారు.
