
68 మంది అయ్యప్ప భక్తులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు ఆదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో దాదాపుగా 60 మంది గాయపడ్డారు. ఇందులో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు. శబరిమలలో అయ్యప్ప దర్శనం ముగించుకుని తిరిగివస్తుండగా బస్సు అదుపు తప్పి పాతనంతిట్ట జిల్లాలోని లోతైన గొయ్యిలో పడిపోయింది. గాయపడిన వారిని వెంటనే పతనంతిట్ట జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరంతా తమిళనాడులోని తాంజావూరుకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గతేడాది నవంబర్ లో ఏపీ నుంచి శబరిమల యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురై బోల్తాపడటంతో 20 మందికి పైగా గాయపడ్డారు