నేరెళ్ల చెరువు గ్రామానికి బస్సు నడపాలి

నేరెళ్ల చెరువు గ్రామానికి బస్సు నడపాలి
  •     రంగారెడ్డి జిల్లా హేమాజీపూర్​లో స్టూడెంట్ల ధర్నా

షాద్​నగర్, వెలుగు : రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలంలోని నేరెళ్ల చెరువు గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ ఆ ఊరికి చెందిన స్టూడెంట్లు గురువారం హేమాజీపూర్ – షాద్​నగర్ రూట్​లో ధర్నా చేపట్టారు. ఆ రూట్​లో వెళ్లే బస్సును ఆపి రోడ్డుపై బైఠాయించారు.

వారు మాట్లాడుతూ.. హేమాజీపూర్– షాద్​​నగర్ రూట్​లో కాలేజీ స్టూడెంట్లు ఎక్కువగా ఎక్కుతుండటంతో బస్సులో స్థలం సరిపోక ఫుట్​బోర్డుపై జర్నీ చేయాల్సి వస్తోందన్నారు. నేరెళ్ల చెరువుకు ప్రత్యేకంగా బస్సును నడపాలని ఆర్టీసీ అధికారులను కోరారు.