- రంగారెడ్డి జిల్లా హేమాజీపూర్లో స్టూడెంట్ల ధర్నా
షాద్నగర్, వెలుగు : రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలంలోని నేరెళ్ల చెరువు గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ ఆ ఊరికి చెందిన స్టూడెంట్లు గురువారం హేమాజీపూర్ – షాద్నగర్ రూట్లో ధర్నా చేపట్టారు. ఆ రూట్లో వెళ్లే బస్సును ఆపి రోడ్డుపై బైఠాయించారు.
వారు మాట్లాడుతూ.. హేమాజీపూర్– షాద్నగర్ రూట్లో కాలేజీ స్టూడెంట్లు ఎక్కువగా ఎక్కుతుండటంతో బస్సులో స్థలం సరిపోక ఫుట్బోర్డుపై జర్నీ చేయాల్సి వస్తోందన్నారు. నేరెళ్ల చెరువుకు ప్రత్యేకంగా బస్సును నడపాలని ఆర్టీసీ అధికారులను కోరారు.