కార్లను తప్పించబోయి డివైడర్ ఎక్కిన బస్సు.. డ్రైవర్ చాకచక్యంతో తప్పిన ప్రమాదం

కార్లను తప్పించబోయి  డివైడర్ ఎక్కిన బస్సు.. డ్రైవర్ చాకచక్యంతో తప్పిన ప్రమాదం

ఘట్​కేసర్, వెలుగు: వెనుక నుంచి స్పీడ్​గా వస్తున్న కార్లను చూసి పక్కకు జరిగే క్రమంలో ఓ ఆర్టీసీ బస్సు డివైడర్​ పైకి ఎక్కింది. ఈ ఘటన వరంగల్​– హైదరాబాద్​ నేషనల్​ హైవేపై జరిగింది. 

శుక్రవారం హనుమకొండ నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ డీలక్స్ బస్సు 28 మంది ప్రయాణికులతో బయల్దేరింది. ఘట్‌కేసర్ సమీపంలోని ఔషాపూర్ వద్దకు రాగానే.. వెనుక నుంచి హైస్పీడ్​తో రెండు కార్లు రావడాన్ని బస్సు డ్రైవర్​ గమనించాడు. 

తమను ఢీకొడుతాయన్న భయంతో బస్సును రోడ్డు పక్కకు నెమ్మదిగా తీసుకెళ్లాడు. ఈ క్రమంలో బస్సు డివైడర్ పైకి ఎక్కింది. బస్సు స్లోగా ఉండడంతో, డ్రైవర్​ చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సు ముందు భాగం స్వల్పంగా ధ్వంసమైంది. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. బస్సును పక్కకు తీసుకెళ్లకుంటే రెండు కార్లు బస్సును ఢీకొట్టేవని స్థానికులు చెప్పారు.