V6 News

డూప్లికేట్ కీస్తో బైక్లు ఎత్తుకెళ్లారు..నలుగురు అరెస్ట్.. 24 బైక్లు సీజ్

డూప్లికేట్ కీస్తో బైక్లు ఎత్తుకెళ్లారు..నలుగురు అరెస్ట్.. 24 బైక్లు సీజ్
  • రూ.2-3 వేలకు అమ్ముతున్నరు

జీడిమెట్ల, వెలుగు: డూప్లికేట్ కీలతో బైక్ దొంగతనాలు చేస్తున్న ఇద్దరితోపాటు వాటిని కొనుగోలు చేస్తున్న మరో ఇద్దరిని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ కేసు వివరాలను కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి శుక్రవారం వెల్లడించారు. మెదక్ జిల్లా రాజపేటకు చెందిన బి.నవీన్ కొంపల్లిలో నివాసముంటున్నాడు.

మహబూబాబాద్​కు జిల్లా మద్దూర్​కు చెందిన టి.శ్రీనివాస్​ పేట్​బషీరాబాద్​లో ఉంటున్నాడు. వీరిద్దరూ ఫ్రెండ్స్ కావడంతో జల్సాల కోసం బైక్​దొంగతనాలను ఎంచుకున్నారు. డూబ్లికేట్​కీలతో నగరంలో బైకులు దొంగలించి, రూ.2 వేలు, రూ.3 వేలకు మెదక్​ జిల్లాలోని రాజపేటకు చెందిన ఎం.రమేశ్, ఎం. శ్రీకాంత్​కు అమ్మేవారు. వారు ఎక్కువ రేటుకు ఇతరులకు ఇచ్చేవారు.

ఇటీవల దుండిగల్ పరిధిలో జరిగిన ఓ దొంగతనంపై పోలీసులు కేసు నమోదు చేసి, సుమారు 200 సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన 24 బైక్​లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం 24 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.