టీకాలు వేయించుకుంటే.. రూ.843 కోట్లు!

టీకాలు వేయించుకుంటే.. రూ.843 కోట్లు!
  • కాలిఫోర్నియా స్టేట్ లక్కీ డ్రా ప్రకటన

లాస్ ఏంజిలిస్: కరోనాను కట్టడి చేసేందుకు టీకాలు వేయించుకున్న వారికి అమెరికాలోని పలు రాష్ట్రాలు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే న్యూయార్క్, ఓహియో రాష్ట్రాలు ప్రజలకు భారీ ఆఫర్లు ఇవ్వగా, తాజాగా కాలిఫోర్నియా స్టేట్ కూడా తమ ప్రజలకు దాదాపు రూ. 843 కోట్ల ప్రైజ్ మనీతో లక్కీ డ్రాను ప్రకటించింది. రాష్ట్రంలో 1.20 కోట్ల మంది 12 ఏండ్లకు పైబడినవాళ్లు టీకాలు తీసుకోలేదట. మొత్తం 3.40 కోట్ల మందిలో 63% మందే టీకాలు వేయించుకున్నారట. అందుకే టీకాలు వేసుకునేలా ప్రోత్సహించడం కోసమని ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రైజ్ మనీ ప్రకటించింది. 12 ఏండ్లు పైబడి ఉండి, కనీసం ఒక్క డోసు టీకా తీసుకున్నా.. ఈ లక్కీ డ్రాలకు అర్హులని వెల్లడించింది. మొత్తంగా 10 మంది టాప్ విన్నర్స్ కు 15 లక్షల డాలర్ల  (రూ. 10 కోట్లు) చొప్పున, 30 మందికి 50 వేల డాలర్ల (రూ. 36 లక్షలు) చొప్పున క్యాష్ ప్రైజ్, 20 లక్షల మందికి 50 డాలర్ల (రూ. 3,600) చొప్పున గిఫ్ట్ కార్డులు అందిస్తామని వివరించింది.