మద్యం మత్తు: 3 బైకులను ఢీకొట్టిన కారు

మద్యం మత్తు: 3 బైకులను ఢీకొట్టిన కారు

హైదరాబాద్: జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర  హోండా సిటీ కార్ బీభత్సం సృష్టించింది. సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న  బైక్‌లను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. అయితే ప్రాణాలకు అపాయంలేదు. ప్రమాదం జరిగాక హోండా సిటీ కార్ ఆపకుండా వెళ్లిపోయారని తెలిపారు. దీంతో యువకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దగ్గరలోని సీసీ కెమెరాను పరిశీలించిన పోలీసులు.. మద్యం మత్తులో  సిటీ హోండా కారులో వేగంగా  వచ్చి డికొట్టిన వ్యక్తిని సాఫ్ట్ వేర్ వేణుగా గుర్తించామన్నారు. బ్రీత్ ఎనలైజర్ లో 173 శాతం నమోదైందని తెలిపిన పోలీసులు ప్రమాదానికి కారణమైన వేణును అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. గాయాలపాలైన క్రాంతి కుమార్,సునీల్ ,శ్రీనివాస్ లను హాస్పిటల్ కు తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నామన్నారు. కారు జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ నుండి ఫిల్మ్ నగర్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందన్నారు.