నార్సింగిలో కారు బీభత్సం.. భారీగా ట్రాఫిక్ జామ్

నార్సింగిలో కారు బీభత్సం.. భారీగా ట్రాఫిక్ జామ్

మితి మీరిన వేగం ఒకరిని బలిగొంది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో కారు బీభత్సం సృష్టించింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్పా జంక్షన్ వద్ద డివైడర్ ను ఢీకొట్టి అవతలి వైపు వెళ్తున్న ఆటోను ఢీకొట్టి నడిరోడ్డుపై బోల్తాపడింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.  ప్రమాదంలో మృతిచెందిన ఆటో డ్రైవర్ ను  ఉపేందర్ గా గుర్తించారు. గాయపడిన వారు అరవింద్, ప్రకాశ్ లను ప్రీమియర్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు.. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.