వికారాబాద్ లో కారు ప్రమాదం: ఒకరు మృతి

వికారాబాద్ లో కారు ప్రమాదం: ఒకరు మృతి

ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొని ఒకరు మృతిచెందగా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పొందూరు రోడ్డుపై జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ముగ్గురిని వికారాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాదంలో పరిగికి చెందిన పవన్ అనే వ్యక్తి మృతిచెందారు. ఈయన పరిగొలోని లొంకహనుమాన్ ఆలయంలో పూజారిగా పనిచేసేవారని పోలీసులు తెలిపారు.