V6 News

రూ.80 వేలు తీసుకొని క్లాస్‎లు చెప్పలే.. 9 నెలల సమయాన్ని కోల్పోపోయిన విద్యార్థిని

రూ.80 వేలు తీసుకొని క్లాస్‎లు చెప్పలే.. 9 నెలల సమయాన్ని కోల్పోపోయిన విద్యార్థిని

జూబ్లీహిల్స్, వెలుగు: అడ్వాన్స్​డ్​సైబర్ సెక్యూరిటీ ఆన్ లైన్ కోర్సుకు ఓ విద్యార్థిని ఆన్​లైన్‎లో డబ్బులు చెల్లించింది.. 9 నెలలైనా క్లాస్‎లు చెప్పకపోవడంతో తండ్రితో కలిసి మధురానగర్​పోలీసులకు ఫిర్యాదు చేసింది. మధురానగర్‎లోని జుపిటర్ టవర్స్‎లో నివాసముంటున్న మాకినేని వీరబ్రహ్మం కూతురు ఈ ఏడాది మార్చి 18న సైబర్ సెక్యూరిటీ కోర్సు కోసం ఆన్ లైన్‏లో వెతకింది. ట్యూటెల్​ఇన్ఫోసెక్  ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఆ కోర్సు అందిస్తున్నట్లు గుర్తించింది. అందులో చేరేందుకు రెండు దఫాలుగా రూ.80 వేలు ఆన్ లైన్ ద్వారా చెల్లించింది. 

ఫీజు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి  క్లాస్ లు అందించలేదు. ఎన్నోసార్లు సదరు కంపెనీ ప్రతినిధులను ఆన్ లైన్ లో సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. విద్యాసంవత్సరాన్ని కోల్పోయానని, కనీసం తాను పంపిన డబ్బులైనా తిరిగి ఇవ్వాలని పలుమార్లు వాట్సాప్‎లో మెసేజ్‎లు పెట్టింది. అయినా సమాధానం రాకపోవడంతో బాధితురాలి తండ్రి ఈ నెల 8న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.