ఆదిలాబాద్ జిల్లా మర్కజ్ కి వెళ్లొచ్చిన రిమ్స్ కంటి వైద్యుడిపై చర్యలు తీసుకున్నారు రిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్. ఉన్నతాధికారుల ఆదేశాలతో డాక్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మర్కజ్ వెళ్లొచ్చిన విషయాన్ని దాచిపెట్టిన డాక్టర్.. రోగులకు చికిత్స అందించిన విషయం తెలిసిందే. మర్కజ్ నుండి వచ్చాక కూడా ఆ డాక్టర్ ఉన్నతాధికారులతో పలు సమావేశాల్లో పాల్గొన్నట్లు తెలిసింది.
దీంతో ఆ వైద్యునిపై సెక్షన్ 176, 188, 270, 271 ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వైద్యుడు క్వారంటైన్లో చికిత్స పొందుతున్నాడు. అయితే కరోనా రిపోర్ట్ పెండింగ్ లో ఉన్నందున ఆందోళన చెందుతున్నారు రిమ్స్ డాక్టర్లు, సిబ్బంది, రోగులు.