
గండిపేట్, వెలుగు : రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి డబ్బులు డిమాండ్ చేసిన ఓ యూట్యూబ్ చానల్ సీఈఓ, రిపోర్టర్పై నార్సింగి పీఎస్లో కేసు నమోదైంది. పోలీసులు వివరాల ప్రకారం.. తొలుత మూసీ బఫర్ జోన్లో నిర్మాణాలు చేపడుతున్నారని, సైట్లోకి వచ్చి ఓ యూట్యూబ్ ఛానల్ మహిళా రిపోర్టర్ బెదిరింపులకు పాల్పడింది.
డబ్బులు ఇవ్వాలని, లేదంటే ఇదంతా బయటకు చెబుతామని బ్లాక్ మెయిల్ చేస్తూ సదరు ఛానల్ సీఈఓతో ఫోన్లో మాట్లాడించింది. దీంతో ఆదిత్య కేడియో రియల్టర్స్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.