ఏపీ డిప్యూటీ సీఎంపై బేగంబజార్ లో కేసు నమోదు

ఏపీ డిప్యూటీ సీఎంపై బేగంబజార్ లో కేసు నమోదు

 బషీర్ బాగ్, వెలుగు: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై బేగంబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీనే కారణమని కొన్ని రోజుల క్రితం నారాయణ స్వామి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై  పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఈ నెల 8న బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నారాయణ స్వామి మాట్లాడిన వీడియో ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా బాధ్యతారాహిత్యంగా ఈ వ్యాఖ్యలు చేసినట్టు గుర్తించారు. దీంతో ఆయనపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసును నమోదు చేశారు.