మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు

మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు

హనుమకొండలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదు అయింది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా హనుమకొండ పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 504, 505 కింద కేటీఆర్ పై కేసు నమోదు అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.