తహసీల్దార్​ ఆఫీసుకు పోలీసు బందోబస్తు

తహసీల్దార్​ ఆఫీసుకు పోలీసు బందోబస్తు

ధన్వాడ, వెలుగు: రూ.లక్ష ఆర్థికసాయానికి దరఖాస్తు చేసుకొనేందుకు కుల, ఆదాయ సర్టిఫికెట్లు అవసరం కాగా, భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వాలని ఒత్తిడి పెరగడంతో రెవెన్యూ సిబ్బంది శుక్రవారం పోలీసుల సాయాన్ని కోరారు. ఆఫీసు తెరిచిన వెంటనే తమ సర్టిఫికెట్లు ఎప్పుడిస్తారని కార్యాలయంలోకి దూసుకొచ్చారు. డబ్బులు ఇచ్చిన వారికే క్లియర్ చేస్తున్నారంటూ తహసీల్దార్ తో పాటు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. వారిని సముదాయించడం సాధ్యం కాకపోవడంతో పోలీసులు సహాయం తీసుకున్నారు. ఏఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో వచ్చి వారిని సముదాయించారు.