100 కాదు.. 200 కాదు.. ఏకంగా అక్షరాల 966 కోట్ల రూపాయల ఎలక్ట్రోరల్ బాండ్లు కొనుగోలు చేసి.. దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు డబ్బులు ఇచ్చిన మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. జగదల్పూర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కు సంబంధించిన పనులకు సంబంధించి మేఘా ఇంజినీరింగ్కు చెందిన రూ.174 కోట్ల బిల్లులను క్లియర్ చేయడంలో సుమారు రూ.78 లక్షలు లంచం తీసుకున్నందుకు ఎన్ఐఎస్పీ, ఎన్ఎండీసీకి చెందిన ఎనిమిది మంది అధికారులు, మెకాన్కు చెందిన ఇద్దరు అధికారుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
ఎఫ్ఐఆర్ ప్రకారం, ఇంటిగ్రేటెడ్లోని ఇంటెక్వెల్, పంప్ హౌజ్, క్రాస్ కంట్రీ పైప్లైన్ పనులకు సంబంధించిన రూ. 315 కోట్ల ప్రాజెక్ట్లో లంచం తీసుకున్నట్లు ఆరోపణలపై సీబీఐ ఆగస్టు 10, 2023 న ప్రాథమిక విచారణ జరిపింది. ప్రాథమిక విచారణలో తేలిన వివరాల ఆధారంగా లంచం ఆరోపణపై సాధారణ కేసు నమోదు చేయాలని మార్చి 18న సిఫార్సు చేశారు.
ఈ కేసులో.. రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ దాష్, డైరెక్టర్ (ప్రొడక్షన్) డీకే మొహంతి, డీజీఎం పీకే భుయాన్, డీఎం నరేష్ బాబు, సీనియర్ మేనేజర్ సుబ్రో బెనర్జీ, రిటైర్డ్ సీజీఎం (ఫైనాన్స్) L కృష్ణ మోహన్, GM (ఫైనాన్స్) 73.85 లక్షల లంచం అందుకున్న కే రాజశేఖర్, మేనేజర్ (ఫైనాన్స్) సోమనాథ్ ఘోష్. సుభాష్ నుండి 73 ఇన్వాయిస్లకు వ్యతిరేకంగా ఎన్ఎమ్డీసీ లిమిటెడ్ కు రూ. 174.41 కోట్లను ఎంఇఐఎల్కు చెల్లించినందుకు రూ. 5.01 లక్షల లంచం తీసుకున్నారని ఆరోపణలున్న మెకాన్ లిమిటెడ్కు చెందిన ఇద్దరు అధికారులను - ఎజిఎం (కాంట్రాక్ట్లు) సంజీవ్ సహాయ్, డీజీఎం (కాంట్రాక్ట్లు) కే ఇల్లవర్సు పేర్లు ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు. ఈ కేసులో జనరల్ మేనేజర్, MEIL, చంద్ర సంగ్రాస్, మేఘా ఇంజినీరింగ్లను కూడా నిందితులుగా చేర్చారు.
మార్చి 21న ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటా ప్రకారం మేఘా ఇంజినీరింగ్ ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలుదారుగా రెండవ స్థానంలో నిలిచింది మరియు అత్యధికంగా దాదాపు రూ. 586 కోట్లను బీజేపీకి విరాళంగా ఇచ్చింది. కంపెనీ బీఆర్ఎస్కు రూ.195 కోట్లు, డీఎంకేకు రూ.85 కోట్లు, వైఎస్ఆర్సీపీకి రూ.37 కోట్లు టీడీపీకి దాదాపు రూ.25 కోట్లు రాగా, కాంగ్రెస్ కు రూ.17 కోట్లు, JD-S, జనసేన పార్టీ, JD-Uకు రూ. 5 కోట్ల నుండి రూ. 10 కోట్లు విరాళంగా ఇచ్చింది.