సీఎం జగన్ పథకాలపై మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొగడ్తలు

సీఎం జగన్ పథకాలపై మాజీ  జేడీ లక్ష్మీనారాయణ పొగడ్తలు

 ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలనపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రశంసల వర్షం కురిపించారు. శ్రీశైలంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా జగన్ చేపట్టిన నాడు-నేడు, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలను ఆయన ప్రశంసించారు. విద్య, వైద్య రంగాల్లో మంచి చేసిన వారికి మెరుగైన ఫలితాలుంటాయని లక్ష్మీనారాయణ అన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు చాలా అందంగా రూపుదిద్దుకున్నాయన్నారు.  అంగన్వాడీల్లో చిన్నపిల్లల పౌష్టికాహారం చాలా బాగుందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా బాధితుల వద్దకే వెళ్లి మందులు ఇవ్వడం శుభపరిణామమని జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.

నాడు – నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు చాలా అందంగా ముస్తాబయ్యాయని కొనియాడారు. అంగన్వాడీలలో చిన్నపిల్లలకు పౌష్టికాహారం రాగిజావ ఇవ్వడపై ప్రశంసలు కురిపించారు. జగనన్న ఆరోగ్య సురక్ష మంచి ప్రోగ్రామ్ అని కొనియాడారు. బాధితుల దగ్గరకే డాక్టర్లు వెళ్లి పరీక్షలు చేయడం.. మందులు ఇవ్వడం పట్ల మంచి పరిణామం అన్నారు. ఎవరైతే విద్యా వైద్య రంగాలలో మంచి పనులు చేస్తారో వారికి అంతే స్థాయిలో ఫలితం కూడా ఉంటుందని అన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.

 సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తాను చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొనేందుకు  శ్రీశైలం వెళ్లారు. అయితే, శ్రీశైలంలోనే ఉన్న ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి ఉన్నారని తెలుసుకుని పూర్వ విద్యార్థుల సమావేశానికి రావాలంటూ ఆహ్వానించేందుకు వెళ్లారు. అదే సమయంలో జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం జరుగుతోంది. జేడీ లక్ష్మీనారాయణ చూసిన ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి స్టేజి మీదికి లక్ష్మీనారాయణ ఆహ్వానించారు.