లిక్కర్ స్కాంపై మనీష్ సిసోడియాను ప్రశ్నిస్తున్న సీబీఐ

లిక్కర్ స్కాంపై మనీష్ సిసోడియాను ప్రశ్నిస్తున్న సీబీఐ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణకు చెందిన వ్యక్తులను ఎందుకు కలిశారని ఆయన్ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. విజయ్ నాయర్ ను ఎందుకు కలిశారు ? మద్యం పాలసీ విధానంలో ఆయనను ఎందుకు భాగస్వామ్యం చేశారు అనే కోణంలో  ప్రశ్నిస్తున్నారు. కొత్త మద్యం పాలసీ వల్ల ఢిల్లీ ప్రభుత్వం ఆదాయం పడిపోతుందని మీకు తెలియదా? అలా చేయడం వల్ల ప్రభుత్వంలో ఎవరు లబ్ధి పొందుతారనే క్వశ్చన్స్ ను సంధిస్తున్నారు. 

కొత్త మద్యం పాలసీలో కొద్దిమంది వ్యాపారులనే ఎందుకు ఎంపిక చేశారని మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రభుత్వం, వ్యాపారస్తుల మధ్య క్విడ్ ప్రొకో జరిగిందా అంటూ ప్రశ్నిస్తున్నారు. మద్యం పాలసీ రూపకల్పనలో తెలంగాణ వ్యక్తులను కలిశారా అని  ప్రశ్నించినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం మద్యం కుంభకోణానికి సంబంధించిన కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన రామచంద్ర పిళ్లై, శరత్ చంద్ర, రాఘవరెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.