పాస్‌పోర్టు స్కామ్‌లో సీబీఐ త‌నిఖీలు

పాస్‌పోర్టు స్కామ్‌లో సీబీఐ త‌నిఖీలు

పాస్‌పోర్టు స్కామ్‌ కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు వేగాన్ని పెంచారు. ప‌శ్చిమ బెంగాల్‌, సిక్కింలోని గ్యాంగ్‌ట‌క్‌లో ఉన్న సుమారు 50 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. పాస్‌పోర్టు కేసులో ప్రస్తుతం ఈ త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. నకిలీ ప‌త్రాలు చూపించి పాస్‌పోర్టులు జారీ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ కేసులో మొత్తం 24 మందిపై కేసులు నమోదు చేశారు. 

కోల్​ కతా, సిలిగురి, గ్యాంగ్‌ట‌క్‌లో ఉన్న ఓ అధికారితో పాటు మ‌రో మ‌ధ్య‌వ‌ర్తిని అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్‌లో మాత్రం 24 మంది పేర్ల‌ను చేర్చారు. ఈ జాబితాలో 16 మంది అధికారులు కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. లంచాలు తీసుకుని అన‌ర్హుల‌కు పాస్‌పోర్టులు జారీ చేసిన‌ట్లు ఆరోపణలు ఉన్నాయి.

Also Read :- 82 ఏళ్ల భార్యకు విడాకులు ఇస్తావా..?angry

కోల్‌క‌తా, సిలిగురి, గ్యాంగ్‌ట‌క్‌తో పాటు మ‌రికొన్ని న‌గ‌రాల్లో సీబీఐ సోదాలు జ‌రుగుతున్నాయి. అర్హులకు కాకుండా అనర్హులకు నకిలీ ధృవపత్రాలతో పాస్ పోర్టులు జారీ చేశారని సీబీఐ అధికారులు గుర్తించి.. సోదాలు చేస్తున్నారు.