
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు ఆమె నివాసానికి చేరుకున్న అధికారులు దాదాపు 4 గంటలుగా కవితను ప్రశ్నిస్తున్నారు. మహిళా అధికారులతో కూడిన ఆరుగురు సభ్యుల సీబీఐ టీం.. 160 సీఆర్పీసీ కింద కవిత స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియా రికార్డింగ్ కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఉదయం నుంచి అడ్వొకేట్ సమక్షంలో అధికారుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీబీఐ అధికారులు అడ్వొకేట్ను బయటకు పంపినట్లు తెలుస్తోంది.
అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ కవిత పేరు ప్రస్తావించిన తర్వాత.. సీబీఐ కవితకు నోటీసు ఇచ్చింది. నిందితులైన బోయినపల్లి అభిషేక్ రావు, అరుణ్ రామచంద్ర పిళ్లై, ఇండో స్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రు స్టేట్మెంట్ ఆధారంగా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.