కాఫీ డే ఫౌండర్..సిద్ధార్థ మృతదేహం లభ్యం

కాఫీ డే ఫౌండర్..సిద్ధార్థ మృతదేహం లభ్యం

కేఫ్ కాఫీ డే ఫౌండర్, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ మిస్టరీ వీడింది.  రెండు రోజులుగా కనిపించకుండా పోయిన  ఆయన నేత్రావతి నదిలో దూకినట్లు అక్కడి స్థానికులు చెప్పారు. రెండు రోజుల నుంచి  గజఈతగాళ్లు వెతకడంతో ఇవాళ ఆయన మృతదేహం లభ్యం అయ్యింది.

ఈ నెల 29న నేత్రావది నది ఒడ్డున డ్రైవర్ తో కారులో వచ్చిన ఆయన కారు ఆపి దిగాడు. డ్రైవర్ కారులోనే ఉన్నాడు. తర్వాత ఎంత సేపైనా సిద్ధార్థ  రాకపోవడంతో డ్రైవర్ కాసేపు వెతికి  కుటుంబ సభ్యులకు  సమాచారం ఇచ్చాడు. తర్వాత వారు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో  పోలీసులు మంగళవారం నుంచి బృందాలుగు వెతకడం మొదలు  పెట్టారు. నదిలో దూకినట్లు ఒక జాలరీ చెప్పడంతో గజ ఈతగాళ్లు నిన్నటి నుంచి గాలించారు.

సిద్ధార్థ ఆత్మహత్యచేసుకునే ముందు  రెండు రోజుల క్రితం సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు లెటర్ రాసినట్లు బయటపడింది.. అందులో తాను ఓ వ్యాపార వేత్తగా విఫలమయ్యాయని..ఎవర్నీ మోసం చేయలేదని తెలిపారు. తాను ఓత్తిడి భరించలేకపోతున్నానని అన్నారు. అందరు క్షమించాలని కోరుతున్న అని లేఖలో రాశారు. సిద్ధార్థ 1990లో కేఫ్ కాఫీ డేను  ప్రారంభించిన ఆయన తక్కువ కాలంలోనే  కేఫ్ కాఫీ డేను ఇంటర్నేషనల్ బ్రాండ్ గా తీర్చిదిద్దారు.