పంజాబ్ అమృత్ సర్ లో పోలీస్ అధికారి గన్ మిస్ ఫైర్ అయింది. దీంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీస్ అధికారి మొబైల్ షాపుకు వెళ్లాడు. గన్ తీసి అక్కడి వారితో మాట్లాడారు. ఈ సమయంలో గన్ పేలింది. దీంతో మొబైల్ షాపులో పనిచేస్తున్న వ్యక్తి గాయపడ్డారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి.
గన్ మిస్ ఫైర్ పై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ప్రత్యక్ష సాక్షులు, కుటుంబసభ్యుల వాంగ్మూలం మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని అమృత్సర్లోని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) వరిందర్ సింగ్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
ఈ నెల ప్రారంభంలో జమ్మూ కాశ్మీర్లో ఇదే విధమైన సంఘటన జరిగింది, ఇందులో ఒక పోలీసు రైఫిల్ ప్రమాదవశాత్తు పేలిపోవడంతో ఓ పౌరుడికి గాయాలై మరణించాడు. బాధితుడిని మహ్మద్ ఆసిఫ్ పద్రూగా గుర్తించిన పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అతను అక్కడ మరణించాడని అధికారులు తెలిపారు.