పాటలో ఆ రెండు లైన్లు తొలగించాలన్న సెన్సార్.. ఇచ్చిపడేసిన అజయ్

పాటలో ఆ రెండు లైన్లు తొలగించాలన్న సెన్సార్..  ఇచ్చిపడేసిన అజయ్

టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మంగళవారం(Mangalavaaram). పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్(Payal Rajputh) హీరోయిన్ గా నటిస్తుండగా.. నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ మరియు శ్రవణ్ రెడ్డి తదితరులు ప్రాధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. టీజర్, ట్రైలర్ తో ఆసక్తిని పెంచిన ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తన్నారు. 

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మంగళవారం సినిమాను సెన్సార్ కు పంపించారు మేకర్స్. అయితే సెన్సార్ బోర్డు ఈ సినిమా మేకర్స్ కు షాకిచ్చింది. ఈ సినిమాలో ఒక పాటలోని రెండు లైన్ల లిరిక్స్ ను తొలగించాలని సూచించింది కానీ.. చిత్ర దర్శకుడు అజయ్ భూపాతి మాత్రం పాటలోని రెండు లైన్లు తొలగించడానికి అంగీకరించలేదు. ఏకంగా ఆపాటనే సినిమా నుండి తీసేశాడు.  

ఇక ఇదే విషయంపై అజయ్ భూపతి స్పందిస్తూ.. సెన్సార్ బోర్డు సినిమాలోని అప్పడప్పడ తాండ్ర పాటలో రెండు లైన్లను తొలగించాలని సూచించారు. అలా చేస్తే సాంగ్ లో ఉన్న ఫీల్ పోతుంది. అందుకే థియేటర్ వర్షన్ లో ఈ సాంగ్ ను తీసేస్తున్నాము.. ఓటీటీ వెర్షన్ లో మాత్రం ఉంటుంది. ఆలోగా పూర్తి పాటను యూట్యూబ్ లో రిలీజ్ చేస్తామని తెలిపారు అజయ్.  దీంతో అది చూసిన నెటిజన్స్.. సెన్సార్ కు అజయ్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు (నవంబర్ 11) హైదరాబాద్లోని జె.ఆర్.సి. కన్వెషన్ లో జరుగనుంది. ఈ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు.