
అనుపమ పరమేశ్వరన్, కేంద్రమంత్రి, నటుడు సురేశ్ గోపి లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’. జానకి అనే మహిళ చేసే న్యాయపోరాటం చుట్టూ తిరిగే కథగా మూవీని ప్రవీణ్ నారాయణ్ తెరకెక్కించారు.
లేటెస్ట్గా ఈ మూవీ సెన్సార్ చిక్కుల్లో పడింది. ఈనెల 27న సినిమాను థియేటర్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఇప్పటికే, అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలోనే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ (CBFC) వారికి షాక్ ఇచ్చింది.
ఈ సినిమా టైటిల్ లో 'జానకి' అనే పేరును వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. జానకి హిందూ దేవత పేరు అని.. మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తున్నందుకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేమని స్పష్టంచేసింది. వెంటనే 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' చిత్రం పేరును మార్చుకోవాలంటూ సూచించింది.
►ALSO READ | డ్రగ్స్ కేసులో హీరో శ్రీరాం విచారణ : ఆ పొలిటికల్ పార్టీ లీడర్ కూ లింక్స్
కానీ దీనిని చేంజ్ చేసేందుకు ప్రొడ్యూసర్స్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఫలితంగా సినిమా విడుదలకు బ్లేక్ పడినట్లు సమాచారం. దీంతో ఈ చిత్రం ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందనే దానిపై స్పష్టత లేదు. అయితే, వారు సెన్సార్ సర్టిఫికెట్ పొందడానికి జానకి అనే పేరును ‘జయంతి’గా మార్చనున్నట్లు తెలుస్తోంది. మరి చివరకు సెన్సార్ విషయంలో ఏమవుతుందో చూడాలి. కోర్ట్ రూమ్ డ్రామా నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ మూవీలో జానకిగా అనుపమ.. లాయర్ గా ప్రముఖ నటుడు సురేశ్ గోపి కనిపించనున్నారు.