తెలంగాణ అభివృద్ధిని కేంద్రం పట్టించుకోవడం లేదు: కేటీఆర్

తెలంగాణ అభివృద్ధిని కేంద్రం పట్టించుకోవడం లేదు: కేటీఆర్

రాజకీయ కారణాలతో తెలంగాణను కేంద్రం పట్టించుకోవట్లేదని ఆరోపించారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లోని మాదాపూర్‌ శిల్పాకళావేదికలో టీఎస్‌ఐపాస్‌ 5వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు రావట్లేదని, చాలా ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఎక్కువగా నాగ్ పూర్ వైపే అభివృద్ధి చేసుకుంటున్నారని చెప్పారు. ప్రపంచస్థాయి మౌళిక వసతులు ఉన్న హైదరాబాద్‌కు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. రక్షణ, వైమానిక రంగాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని అన్నారు.

హైదరాబాద్‌ను పారిశ్రామిక కాలుష్యం లేని నగరంగా మారుస్తున్నామని తెలిపారు మంత్రి కేటీఆర్. ORR వెలుపల కాలుష్య రహితంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. కొత్త తరహా ఆలోచనలతో వచ్చే అందరికీ రాయితీలు ఇస్తామని తెలిపారు. హైదరాబాద్‌ ఫార్మాసిటీని అతి త్వరలోనే ప్రారంభించబోతున్నామన్న కేటీఆర్.. ఇందు కోసం 10 వేల ఎకరాలు సేకరించామన్నారు.