లోక్​సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలె:ఈసీ

లోక్​సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలె:ఈసీ

న్యూఢిల్లీ: లోక్​సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్​ తేదీలను ఇంకా ప్రకటించలేదని కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల షెడ్యూల్​ను అధికారికంగా తామే వెల్లడిస్తామని తెలిపింది. వాట్సాప్​ గ్రూపులలో తిరుగుతున్న ఎన్నికల తేదీలన్నీ ఫేక్​ అని ఆదివారం పేర్కొంది. ఈసీ తన ప్రకటనను ‘ఎక్స్’ తదితర సోషల్​మీడియా ప్లాట్​ఫాంమ్స్ లో రిలీజ్​ చేసింది. అవన్ని తప్పు​ మెజేస్​లు అని తెలిపింది. “మార్చి 12న నోటిఫికేషన్​ ఇస్తారని.. మార్చి 28 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారని.. ఏప్రిల్ 19న పోలింగ్​ జరుగుతుందని.. మే 22న ఓట్ల లెక్కింపు జరుగుతుందని” వాట్సాప్​ గ్రూపులలో వైరల్​ అవుతున్న మెసేజ్​ నకిలీ(ఫేక్) అని తెలిపింది.