కోస్గిలో ఫ్లాగ్ మార్చ్

కోస్గిలో ఫ్లాగ్ మార్చ్

కోస్గి, వెలుగు: పట్టణంలో బుధవారం సాయంత్రం కేంద్ర బలగాలు ఫ్లాగ్ మార్చ్  నిర్వహించాయి. పోలీస్ స్టేషన్  నుంచి ప్రారంభమై మార్చ్​ శివాజీ చౌరస్తా, రామాలయం, ఎస్సీ కాలనీ, జాండ్ర కమ్యూనిటీ హాల్, తహసీల్దార్​ ఆఫీస్, శివాజీ చౌరస్తా కొనసాగింది. ఈ సందర్భంగా అడిషనల్​ ఎస్పీ నాగేంద్రుడు మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా భరోసా కల్పించేందుకు ఫ్లాగ్ మార్చ్  నిర్వహించినట్లు చెప్పారు. సీఐ జనార్ధన్, ఎస్ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.

ALS0 READ: ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు చర్యలు : కోయ శ్రీహర్ష