ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు చర్యలు : కోయ శ్రీహర్ష

ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు చర్యలు : కోయ శ్రీహర్ష

నారాయణపేట, వెలుగు: ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకొని ఎన్నికలు సజావుగా నిర్వహిస్తామని కలెక్టర్  కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను తనిఖీ చేసి, జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని పర్యవేక్షించారు.

ALS0 READ: పోలీసులను జీపుల ముందు పరిగెత్తిస్తామనడం సిగ్గు చేటు: పువ్వాడ అజయ్ కుమార్ 

ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తే ఎన్నికల సంఘం నిబంధన మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రచారాలు, సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి కోసం సువిధ ఆన్​లైన్‌  యాప్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పర్మిషన్లు ఇస్తామని చెప్పారు. ఎస్డీసీ రాజేందర్ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.