ఏపీలో స్థానికత గడువును మరో రెండేళ్లు పొడిగించిన కేంద్రం

ఏపీలో స్థానికత గడువును మరో రెండేళ్లు పొడిగించిన కేంద్రం

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి స్థిరపడాలని అనుకున్నా.. వెళ్లలేకపోయిన వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో స్థానికత గడువును మరో రెండేళ్లు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేవారికి స్థానికత కల్పించేందుకు ఇప్పటివరకూ ఉన్న ఐదేళ్ల గడువును ఏడేళ్లకు పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర హోమ్ శాఖ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను గెజిట్ లో చేర్చింది. ఇటీవల సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని కలిసినప్పుడు గడువును పొడిగించాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. జగన్ కోరికతో మోడీ స్వయంగా హోమ్ శాఖకు స్థానికత గడువును పెంచాలని సూచించినట్టు సమాచారం.