దేశ వ్యాప్తంగా కరోనాతో 382 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) తెలిపింది. కరోనాతో ఎంత మంది డాక్టర్లు చనిపోయారో తెలపాలంటూ పార్లమెంట్లో ఎదురైన ప్రశ్నకు ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సమాధానం చెప్పక పోవడంతో.. ప్రజల ఆరోగ్యం రాష్ట్రాల బాధ్యత అని సహాయ శాఖ మంత్రి అశ్విని కుమార్ చౌబే తెలిపారు. దీనిపై ఆగ్రహంగా ఉన్న ఐఎంఎ…. ఆ వివరాలను ప్రకటించుకోవాల్సి వచ్చింది. ఇప్పటి వరకు కరోనా రోగులకు సేవలందిస్తూ 382 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారని, వీరిలో అత్యంత చిన్న వయస్సు కల్గిన వ్యక్తి 27 ఏళ్లు కాగా, ఎక్కువ వయస్సు కలిగిన వారిలో 85 ఏళ్ల డాక్టర్ వున్నారని తెలిపింది. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఆరోగ్య కార్యకర్తల సహకారాన్ని తీసుకున్న కేంద్రం, దానికి ఎంత మంది వైద్య నిపుణులు బలయ్యారో తెలుపకపోవడం విచారకరమని ఐఎంఎ ఆందోళన వ్యక్తం చేసింది. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన వీరులు (డాక్టర్లు) పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యింది. ఇంత మంది డాక్టర్లు, ఆరోగ్య సంరక్షకులను భారత్ తప్ప ఏ దేశమూ కోల్పోలేదని ప్రకటనలో తెలిపింది.
డాక్టర్ల మరణాలపై కేంద్రం నిర్లక్ష్యం: ఐఎంఎ ఆగ్రహం
- దేశం
- September 18, 2020
మరిన్ని వార్తలు
-
మోదీ రూ.80 లక్షల హోటల్ బిల్లు ఎగ్గొట్టిన అధికారులు.. నోటీసులు ఇచ్చిన ఓనర్
-
టెన్త్ పాస్ అయితే చాలు.. ఎయిర్ఫోర్స్లో జాబ్స్
-
EVMలు పని చేయటం లేదు.. పోలింగ్ టైం పెంచాలి: బీజేపీ కీలక నేత సంచలన వ్యాఖ్యలు
-
పూణే కారు ప్రమాదంలో రోజుకో ట్విస్ట్
లేటెస్ట్
- బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు
- మోదీ రూ.80 లక్షల హోటల్ బిల్లు ఎగ్గొట్టిన అధికారులు.. నోటీసులు ఇచ్చిన ఓనర్
- బెంగళూరు రేవ్ పార్టీ.. ఫామ్హౌజ్ ఓనర్కు నోటీసులు
- ఈ చైనా వాళ్ల దుంపతెగ : ఐస్ క్రీంను బాతు గుడ్లతో తింటున్నారు..
- Amitab Bachchan: నాగ్ అశ్విన్ ఆలోచనాశక్తి అద్భుతం.. కల్కి సినిమాపై బిగ్ బి ప్రశంసలు
- యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 4 గంటలు
- సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతల భేటీ
- సెలక్ట్ అయితే చాలు: చదివిస్తారు.. కొలువిస్తారు
- Devara: దేవర మూవీ కథ చెప్పేసిన జూనియర్ ఆర్టిస్ట్.. అలా అయితే థియేటర్స్లో పూనకాలు కన్ఫర్మ్
- హైదరాబాద్లో హోటళ్లు, రెస్టారెంట్లపై కొనసాగుతున్న దాడులు
Most Read News
- మిథాలీ రాజ్తో పెళ్లి.. మౌనం వీడిన శిఖర్ ధావన్
- విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం...
- T20 World Cup 2024: నాయకుడిగా బాబర్.. వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన పాకిస్తాన్
- T20 World Cup 2024: జడేజాకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ తుది జట్టును ప్రకటించిన యువరాజ్ సింగ్
- పరకడుపునే నీరు తాగితే లాభాలేంటి.. ఎన్ని గ్లాసులు తాగాలి..
- డిగ్రీ పట్టా అందుకున్న సారా.. సచిన్ ఎమోషనల్ పోస్ట్
- T20 World Cup 2024: భారత క్రికెట్ జట్టు అమెరికా పయనం.. ఆ ఐదుగురు స్వదేశంలోనే
- ఇకపై హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చాలా ఈజీ.. వివరాలిగో..
- అవినీతి ఆరోపణలు.. ఆరుగురు ఆఫీసర్లపై సర్కార్ వేటు
- SRH vs RR: చిత్తుగా ఓడిన రాజస్థాన్.. ఫైనల్ల్లో సన్రైజర్స్