బొగ్గు గనుల వేలం నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి: మాజీ ఎంపీ కవిత

బొగ్గు గనుల వేలం నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి: మాజీ ఎంపీ కవిత

బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం  ప్రైవేట్ కు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు విధులు బహిష్కరించారు. కార్మికుల సమ్మెతో గనులు అన్ని మూతపడ్డాయి. ఈ సందర్భంగా మాజీ ఎంపీ, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కవిత  ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. బొగ్గు గనులను ప్రైవేట్ కు అనుమతించే నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బొగ్గు గనులను ప్రైవేట్ సంస్థలకు వేలం వేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా వేలాదిమంది బొగ్గు గని కార్మికులు సమ్మెలో ఉన్నారన్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్‌ కూడా ఒక రోజు సమ్మె చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని తాము డిమాండ్‌ చేస్తున్నట్లు కవిత ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.