రాష్ట్రాలకు ఫ్రీగా కరోనా వ్యాక్సిన్

రాష్ట్రాలకు ఫ్రీగా కరోనా వ్యాక్సిన్

కరోనా వ్యాక్సిన్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు ఉచితంగా టీకాలు సరఫరా చేస్తామని కేంద్రం ప్రకటించింది. సీరమ్ సంస్థ నుంచి ఒక్కో టీకాను కేంద్రం రూ. 150లకు కొనుగోలు చేయనుంది. వాటిని రాష్ట్రాలకు ఉచితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘కోవ్యాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను రూ. 150 లకు కొనుగోలు చేస్తాం. వాటిని రాష్ట్రాలకు ఉచితంగా అందిస్తాం’ అని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

వ్యాక్సిన్ల ధరలు రాష్ట్రాలకు ఒక విధంగా.. కేంద్రానికి ఒక విధంగా ఉండటంతో పలు రాష్ట్రాల నుంచి విమర్శలు వచ్చాయి. దాంతో ధరలపై సమీక్ష నిర్వహించిన కేంద్రం, ఆరోగ్య శాఖ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయి.