తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో రూ.వేల కోట్ల వరకు నష్టం జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. తక్షణ సహాయంగా రూ.1350 కోట్లను విడుదల చేయాలని కోరుతూ ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ..సీఎం కేసీఆర్ లేఖ రాశారు.ఈ క్రమంలో కేంద్ర బృందం రేపు(గురువారం) సాయంత్రం హైదరాబాద్కు రానుంది. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు నగరానికి కేంద్రం బృందం వచ్చి రెండు రోజుల పాటు హైదరాబాద్తో పాటు ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. నష్టం తీవ్రతను అంచనా వేయనుంది.
ఇప్పటికే నగర ప్రజలకు తక్షణ సాయం కింద సీఎం కేసీఆర్ రూ. 550 కోట్ల సాయం ప్రకటించారు. వరద బాధితుల కుటంబాలకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇక ఢిల్లీ ప్రభుత్వం రూ. 15 కోట్లు, తమిళనాడు ప్రభుత్వం రూ. 10 కోట్లు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రూ. 2 కోట్లు, మై హోం సంస్థ రూ. 5 కోట్లు, చిరంజీవి, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ రూ. కోటి చొప్పున ప్రభుత్వానికి విరాళం అందించారు.